హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రైతన్నకు తోడుగా, పేదలకు అండగా నిలుస్తున్నది రాష్ట్ర పౌరసరఫరాలశాఖ. రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, పేదల ఆకలి తీర్చేందుకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ అమలు వంటి సంస్కరణలను చేపట్టింది. కొత్త రాష్ట్రమైనా అనతికాలంలోనే ధాన్యం కొనుగోలులో అద్భుత ప్రగతి సాధించింది. 2014-15 నుంచి 2021- 22 వరకు 98,885 కోట్ల విలువైన 6.06 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేయడం గమనార్హం.
అవినీతికి చెక్..