హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లో 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (టీఎస్పీఈజేఏసీ) కన్వీనర్ పీ రత్నాకర్రావు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వీరికి ఈపీఎఫ్ స్థానంలో జీపీఎఫ్ను అమలుచేయాలని కోరారు. పాత పెన్షన్ అమలుచేయాలని కోరుతూ శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్లో రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించారు.
ఉద్యోగుల జీపీఎఫ్ విషయంలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉన్నదని రత్నాకర్రావు పేర్కొన్నారు. జేఏసీ చైర్మన్ జీ సాయిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో పలు సంఘాల నేతలు పీ సదానందం, ఇ శ్రీధర్, వేణు, వెంకటేశ్వర్లు, అనిల్కుమార్, ఎంఏ వజీర్, గోవర్ధన్, కుమారచారి తదితరులు పాల్గొన్నారు.