హుజూరాబాద్, ఆగస్టు 17: సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి తీసుకువచ్చిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులను పేదరికం నుంచి బయటపడేయాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ దళితబంధుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. కొందరు రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే దళితబంధు అమలుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం హుజూరాబాద్ మండలం సింగాపూర్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్తో కలిసి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఇంచార్జీలతో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో హన్మకొండ జడ్పీ చైర్మన్ మారెపెల్లి సుధీర్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, షాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళితబంధును విమర్శించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కనపర్తి, రెడ్డిపల్లి, ఘన్ముక్ల గ్రామాల్లో మంగళవారం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.