భిక్కనూర్/హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాతృమూర్తి గంప రాజమ్మ (97) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్లో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
రాజమ్మకు ఇద్దరు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమారుడు గంప గోపాల్ టీఎస్ ఎన్పీడీసీఎల్లో డైరెక్టర్ కాగా, చిన్న కుమారుడు గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజమ్మ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గంప గోవర్ధన్కు ఫోన్ చేసి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పీకర్ పోచా రం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. రాజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.