రక్తహీనతను అధిగమించేందుకు వినూత్న కార్యాచరణ
స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో త్వరలో కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలోని కౌమార బాలికలకు పౌష్టికాహార కిట్లు అం దించాలని ప్రభు త్వం నిర్ణయించిం ది. వారిలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కర్జూర, నెయ్యి, ప్రొటీన్ బిస్కట్లతో ప్రత్యేకంగా రూ పొందించిన కిట్ను 15 రోజులకు ఒకటి చొప్పున 300 రోజులకు సరిపడా పంపిణీ చేయనున్నది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో 11 నుంచి 14 ఏండ్ల వయస్సు ఉన్న బాలికలకు ఏకకాలంలో ఈ కిట్లు అందించనున్నది. ముందుగా ప్రత్యేక ప్రతిభావంత కౌమార బాలికలకు అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వీరి సంఖ్య సుమారు 10 వేల వరకు ఉంటుందని అంచనా వేసింది.
ఇప్పటికే ప్రభుత్వం జాతీ య కుటుంబ సర్వే-5 ప్రకా రం 15 నుంచి 19 ఏండ్ల వయస్సు ఉన్న యువతుల్లో రక్తహీనత శాతం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. భవిష్యత్తులో ఈ సమస్యను ఎదుర్కొనే వారిని గు ర్తించి ముందునుంచే రక్తహీనతను కట్టడి చే యాలని ముం దస్తు కార్యాచరణను రూపొందించింది. భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసి ముందుగా కౌమార దశలోని బాలికల ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు వారికి అత్యున్నత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యాదేవరాజన్ తెలిపారు. త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.