ప్రభుత్వానికి ఆర్యూపీపీ వినతి
హైదరాబాద్, మార్చి 13 : పెండింగ్లో ఉన్న భాషాపండితుల అప్గ్రేడేషన్ను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్యూపీపీ) కోరింది. ఈ మేరకు సంఘం నేతలు ఆదివారం రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. హామీని నెరవేర్చుతారన్న విశ్వాసం తమకు ఉన్నదని, వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీ జగదీశ్, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, గోపాల్, కొండా యాదగిరి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.