హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీ దుకాణాలు, దోబీఘాట్లకు ప్రభుత్వమిస్తున్న ఉచిత విద్యుత్తు కనెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ చేయవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సెలూన్లు, లాండ్రీలకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. బకాయిల పేరిట పలుచోట్ల కనెక్షన్లు తొలగిస్తుండటంతో ప్రభుత్వం డిస్కంలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.