హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి హజ్కు వెళ్లిన యాత్రికులు ఈ నెల 15 నుంచి తిరిగి రానున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి హజ్ టెర్మినల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు.
అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట హజ్ కమిటీ ఈవో లియాఖత్ హుస్సేన్, జీఎంఆర్ సీవోవో అరుణ్భేలా, డిప్యూటీ సీఈవో సుమిత్ కపూర్, ర్యాంప్ మేనేజర్ మూర్తి, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ అఖిల తదితరులున్నారు.