హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు.
కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి, కోమటిపల్లి, నెల్లికుదురు మండలంలోని చిన్ననాగారం, చిన్న ముప్పారం, రాజులకొత్తపల్లి గ్రామాలతో నూతన మండలాన్ని ప్రతిపాదించారు. ఈ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి రానున్నది. ఈ మండల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లో తెలియజేయాలని సీఎస్ సోమేశ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.