రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ల జాతర మొదలైంది. నోటిఫికేషన్లకు ముందు ఉండే మూడు ప్రక్రియల్లో భాగంగా తొలి దశను పూర్తి చేస్తూ 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం శాఖలవారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. శాఖల వారీగా, విభాగాల వారీగా, క్యాడర్ వారీగా ఖాళీల వివరాలను వెల్లడించింది. వీటిని ఏ బోర్డు ద్వారా ఎలా భర్తీ చేస్తారో ఆయా జీవోల్లో స్పష్టంచేశారు. 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రిపరేషన్లో నిమగ్నమైన నిరుద్యోగులు.. నోఫికేషన్లు మొదలు కావడంతో రెట్టించిన ఉత్సాహంతో లక్ష్య సాధనకు సమాయత్తమవుతున్నారు.
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం శాఖలవారీగా ఉద్యోగ నియామకాలకు అనుమతిస్తూ జీవోలు విడుదల చేసింది. 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, తొలి విడతలో 30,453 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఇతర శాఖల్లోని ఖాళీలపై త్వరలోనే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఆయా శాఖల మంత్రులు, ఆయా శాఖాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి అనుమతులు ఇవ్వనున్నారు. ఆర్థిక శాఖ అనుమతులతో నియామక ప్రక్రియను ఆయా శాఖలు చేపట్టనున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ పడింది. 503 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది.
ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖలో 121 -మండల పరిషత్తు అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్- 91, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్-48, డిప్యూటీ కలెక్టర్-42, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్-40 పోస్టులు ఉన్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నది. సాధారణంగా నోటిఫికేషన్లకు ముందు మూడు దశలు ఉంటాయి. ఇందులో భాగంగా మొదటి దశలో సీఎం కేసీఆర్ ప్రకటనతో విధానపరమైన నిర్ణయంగా వెలువడింది. ఇందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని, పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవోలు జారీచేసింది. శాఖల వారీగా, విభాగాల వారీగా, క్యాడర్ వారీగా ఖాళీల వివరాలను వెల్లడించింది. వీటిని ఏ బోర్డు ద్వారా ఎలా భర్తీ చేస్తారో ఆయా జీవోల్లో స్పష్టంచేశారు. రెండో దశలో స్పోర్ట్స్, వికలాంగులు, ఓపెన్, ఈడబ్ల్యూఎస్ వంటి కోటాలను నిర్ధారిస్తారు. ఉద్యోగం, పేరు, స్కేల్, విద్యార్హతలు, వయోపరిమితి వివరాలతో కూడిన ఇండెంట్ను రిక్రూట్మెంట్ ఏజెన్సీకి పంపిస్తారు. ఇదే ఇండెంట్లో శాఖల వారీగా సామాజిక వర్గాలకు ఎన్ని పోస్టులు కేటాయించారో రోస్టర్ పాయింట్లను పేర్కొంటారు. కొన్ని ఉద్యోగాలకు ప్రత్యేక కండిషన్స్ ఉంటాయి. వాటిని ఆయా ఇండెంట్లలో పేర్కొంటారు. ఉదాహరణకు దేవాదాయ శాఖలోని కొన్ని పోస్టులను హిందువులతోనే భర్తీచేస్తారు. ఆయా నిబంధనలను స్పష్టంగా పేర్కొంటారు. ఇక మూడో దశలో రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు తమకు అందిన ఇండెంట్ను క్రాస్చెక్ చేసుకొంటారు. రోస్టర్, పోస్టులు సవ్యంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. దీంతోపాటు జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య సక్రమంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. ఇందుకోసం 33 జిల్లాలు, 60 రకాల సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది.
గ్రూప్-1 పోస్టులు
పోలీస్ శాఖ (డీజీపీ & ఎస్పీఎఫ్ )
జైళ్ల శాఖ
రవాణా శాఖ
వైద్యారోగ్యశాఖ