నల్లగొండ : రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ గురువారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మర్రిగూడ మండలంలో గ్రామభారతి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ఉద్యానవన (హార్టి కల్చరల్) పాలిటెక్నిక్ ( వృత్తి విద్యా) కళాశాల ప్రారంభోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
కొండా లక్ష్మణ్ హార్టీ కల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న ఈ పాలిటెక్నిక్ కళాశాల ద్వారా పూర్తిగా వెనుకబడిన మర్రిగుడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళి సై చేతులమీదుగా ఈ కళాశాల ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు.