హైదరాబాద్ : తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమృద్ధి పండిన పంటలు ఇంటికి వచ్చిన వేళ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి పండుగ జరుపుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించాలని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.