హైదరాబాద్ : తమిళిసై సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్గా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై తమిళిసై ఓ పుస్తకం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, రాజ్భవన్ సిబ్బంది పాల్గొన్నారు.
పుస్తకం విడుదల చేసిన అనంతరం తమిళిసై సౌందర్ రాజన్ ప్రసంగించారు. గవర్నర్గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. తనకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని గవర్నర్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత పెంచాలని సూచించారు.
వ్యాధులు, వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పనితీరు బాగుందని ప్రశంసించారు. మొబైల్ టెస్టింగ్ల ద్వారా కొవిడ్ టెస్టులు నిర్వహించడం మంచి నిర్ణయం అన్నారు. తెలంగాణ దేశానికే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందని కొనియాడారు. సీఎం కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. పుదుచ్చేరికి పీపీఈ కిట్లు, మాస్కులు అందజేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.