హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ అకాల మరణం పట్ల తెలంగాణ గవర్నర్ (Governor) సీ.పీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ గుండె పోటుతో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అందరికి ఆదర్శవంతంగా పేరొందిన రాజీవ్ రతన్(Rajeev Ratan) లేని లోటు తీరనిదని అన్నారు. ఈ సందర్భంగా రాజీవ్రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.