హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): బతుకమ్మ పండుగ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుకలు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపడతాయన్నారు. మహిళా జర్నలిస్టులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన కళాకారులతో ఈ నెల 25న, అలాగే రాజ్భవన్ పరివార్ మహిళలతో ఈ నెల 26న రాజ్భవన్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు వివరించారు.