హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లో నిర్వహిం చే వేడుకలలో విజయ డెయిరీ ఉత్పత్తులనే వినియోగించాలని గవర్నర్ త మిళిసై సౌందర్రాజన్ నిర్ణయించారు. రాజ్భవన్ కార్యాలయంతోపాటు ఉ ద్యోగులు, సిబ్బంది క్వార్టర్స్లోనూ విజయ ఉత్పత్తులనే సరఫరా చేయాలని ఆదేశించారు. విజయ డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎండీ శ్రీనివాస్ రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమయ్యారు. విజయ డెయిరీ ప్రగతిపై ఎండీ గవర్నర్కు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా రు. రూ.30 కోట్ల అప్పుల్లో ఉన్న డెయిరీని రూ.61 కోట్ల లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. రూ.250 కోట్ల తో మెగా డెయిరీని ప్రారంభించన ట్టు తెలిపారు. డెయిరీ పనితీరు, పాల ఉత్పత్తుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేసిన గవర్నర్.. విజయ డెయిరీకి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.