హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియం లో రెండురోజుల పాటు నిర్వహించనున్న క్రీడలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశు సంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ దివ్యాంగులు దైవ స్వరూపులని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కొనసాగుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో అధిక నిధులు కేటాయించారని అన్నారు.విద్య ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఐదు శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పెన్షన్లు మూడువేల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
,