Minister Indrakaran Reddy | నిర్మల్ : అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో పరిస్థితులు ఎట్లా ఉండెనో ప్రజలకు తెలుసునన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుండేనే ఎప్పుడు పోతుండెనో తెలిసే కాదని, పంటలు ఎండిపోయిన పరిస్థితులు ఉండేవన్నారు. సీయం కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
స్వరాష్ట్ర ఫలాలు కండ్ల ముందు కనపడుతున్నాయన్నారు. అభివృద్థి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్గా నిలిచిందన్నారు. పల్లె, పట్నం, తండాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగు నిండాయని, రైతులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా అందరి బతుకులు బాగుపడ్డాయన్నారు. అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ సర్కారు వైపు, తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తోందన్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇలాంటి అభివృద్ది, సంక్షేమం మన పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదన్నారు. అందుకే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ మా రాష్ట్రంలో పోటి చేస్తే బాగుండేదని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మాక్కూడా వస్తే బాగుంటుందని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల సంక్షేమం, పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు వివరించాలని పిలుపునిచ్చారు.