రాజన్న సిరిసిల్ల : సావిత్రి బాయి పూలే(Savithribai Phule) సేవలు మరువలేనివని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip Adi Srinivas )అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు( Tributes). అనంతరం వేములవాడ పట్టణంలోని 17వ వార్డులో ప్రజా పాలన సభ హాజరై మాట్లాడారు. స్త్రీ విద్య కోసం సావిత్రి బాయి ఎంతో కృషి చేశారన్నారు. తన ఇంటినే పాఠశాలగా మార్చి
ఎంతో మందికి విద్యను అందించారని ప్రశంసించారు. తన భర్త జ్యోతిరావుపూలేతో కలిసి ఆనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. అలాంటి మహనీయుల బాటలో మనం నడువాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. దరఖాస్తుల కోసం ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరిని నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.