హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): రవాణా శాఖలో డీటీసీ, జేటీసీలుగా పదోన్నతులు పొందిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఐటీ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, అడ్మినిస్టేషన్, ప్లానింగ్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా శివలింగయ్యకు పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లుగా పదోన్నతులు పొందిన రవీందర్కుమార్గౌడ్ని ఆదిలాబాద్ డీటీసీ, వాణిని నల్లగొండ డీటీసీ, ఆఫ్రీన్ సిద్దిఖీని కమిషనర్ కార్యాలయ డీటీసీ, కిషన్ను మహబూబ్నగర్, సదానందంను రంగారెడ్డి డీటీసీలుగా నియమించింది.