హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్పెషల్ డెవలప్మెట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పనులను వెంటనే నిలిపివేయాలని ప్ర భుత్వం ఆదేశించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకా లు, అభివృద్ధి పథకాలకు గతంలో ప్రభు త్వం ప్రత్యేక అభివృద్ధి నిధులను మం జూరు చేసింది. ఈ నిధులతో పనులు, పథకాలు కూడా కొనసాగుతున్నాయి.
అయితే వీటిని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆయా పనులు, పథకాలు ఏ దశలో ఉన్నాయో సమగ్ర వివరాలు సేకరించాలని సూచించింది. పనులు ప్రారంభం అయ్యాయా?.. ఒకవేళ ప్రా రంభమైతే ఎంత శాతం పూర్తయ్యాయి? ఎంత మేర బిల్లులు చెల్లించారు? వంటి సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఈ నివేదికను మూడు రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది.