హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని బేవరేజెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. ముఖ్యంగా బేవరేజెస్ కార్పొరేషన్లో 230 మంది ఉండాల్సిన చోట 120 మందితోనే ఎలాంటి ఆటంకం లేకుండా ఉత్పత్తికి కష్టపడుతున్నామని, తక్షణమే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. చర్చల్లో వచ్చిన సమస్యలను జాబితా రూపంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్కు విన్నవించాలని నిర్ణయించారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు కలిసికట్టుగా ముందుకుసాగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ స్టోర్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ గంగా, ధీరజ్, లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ యాకుబ్, కోశాధికారి శివకుమార్, కో ఆర్డినేటర్ ఆనందకుమార్, విఠల్, ఝాన్సీ, బాలచందర్ పాల్గొన్నారు.