సంగారెడ్డి : ఎస్సీ, ఎస్టీ కాలనీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. ఆదివారం జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని చిన్న హైదరాబాద్లో గ్రామంలో సీసీ రోడ్లు పనులను ప్రారంభించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో ప్రజలకు మౌలిక సదుపాయలు కల్పించేందుకు సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మాణం చేసేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు.
జహీరాబాద్ మున్సిపల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు మిషన్ భాగీరథలో మంజీరా నీరు సరఫరా అవుతున్నట్లు వివరించారు.
హరిత హారంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ చేసుకోవాలన్నారు. మున్సిపల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.