కామారెడ్డి : జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం హసన్ పల్లి గేటు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
అలాగే ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బాధితులకు తక్షణ సహాయం కింద మూడు లక్షలు అందించారు.
కాగా, పిట్లం మండలం చిల్లెర్గి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ చిల్లెర్గి గ్రామానికి చేరుకొని మృతులకు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు.