తెలంగాణ బడ్జెట్లో గౌడ్స్ కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్పై ఆయన స్పందిస్తూ.. 8 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ప్రమాదంతో అంగవైకల్యం పొందితే రూ. 5 లక్షలు ప్రకటించడం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమన్నారు.
వైన్స్లలో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 393 దుకాణాలు గౌడ్స్కి దక్కి ఆర్ధిక స్వావలంబనకు దోహదపడ్డాయన్నారు. రూ 20 కోట్లతో నీరా నందనవనం అభివృద్ధి, నెక్లస్ రోడ్డులోని నీరా కేఫ్ పనులు సాగించడం గౌడ్స్ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఉప సభాపతి పద్మారావు గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.