హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): మాజీమంత్రి ముఖేశ్గౌడ్ తనయు డు, సిటీ బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ రాష్ట్ర నాయకత్వంపై అలిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు పార్టీలో సముచిత స్థానం దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. పార్టీ నుంచి రాజాసింగ్ సస్పెండ్ అయిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు చూసుకోవడంతో టికెట్ ఆయనకేనన్న ప్రచారం జరిగింది. చివరి క్షణంలో రాజాసింగ్పై సస్పెన్షన్ను ఎత్తివేసిన అధిష్ఠానం తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వడంతో విక్రమ్గౌడ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఆయన పార్టీ వీడడం ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన బీజేపీ పెద్దలు ఎన్నికల తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయ న వెనక్కి తగ్గారు. కానీ, ఎన్నికల తర్వాత నాయకత్వం తనను పట్టించుకోవడం లేదం టూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇక లాభం లేదని పార్టీ వీడేందుకు సిద్ధమైన విక్రమ్గౌడ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి గురువారం పిలిపించుకొని మాటా ్లడి బుజ్జగించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఆయన అలకవీడలేదని సమాచారం. ఎన్నికల ముందు కూడా ఇలానే చెప్పి తర్వాత పట్టించుకోవడం మానేశారని చెప్తూ సన్నిహితుల వద్ద వాపోయారట. త్వరలోనే ఆయన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అభిమానులు చెప్తున్నారు.