Raja Singh | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లకు సంబంధించిన స్క్రీన్షాట్ను కూడా ఆయన షేర్ చేశారు. ఈ క్రమంలో రాజా సింగ్ మాట్లాడుతూ.. తనను చంపుతామని పదే పదే హెచ్చరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా దీనిపై చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపు కాల్స్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు లేఖ కూడా రాశానన్నారు.
ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని రాజా సింగ్ అన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించినవాళ్లు ఎన్ని తన వద్ద ఎన్ని నంబర్లు ఉన్నాయని అడిగారని.. అందుకు ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని తెలిపారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళ్తే అయినా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో సీఎం నంబర్ ఇచ్చానని తెలిపారు. ధర్మం కోసం పనిచేస్తే తనను, తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.