హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ(BJP )ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్గా అక్బరుద్దీన్(Akbaruddin Owaisi)ను నియమిస్తే తాను ప్రమాణ స్వీకారం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీకి పూర్తి స్థాయి స్పీకర్ వచ్చాకే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తేల్చిచెప్పారు.
కాగా, 2018లోనూ రాజాసింగ్ ప్రొటెమ్ స్పీకర్ వద్ద ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడు కూడా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రొటెమ్ స్పీకర్గా వ్యవహరించారు. దీంతో అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చాకే ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఛాంబర్లో రాజాసింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.