హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నప్పటికీ రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. మార్చి నెలలో రూ.104.37 కోట్లు వచ్చినట్టు పాలకమండలి వెల్లడించింది. శ్రీవారిని 16,27,801 మంది భక్తులు దర్శించుకోగా, 7,84,329 మంది తలనీలాలు సమర్పించారని పేర్కొన్నది.