Goods train: ఖమ్మం జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శనివారం ఉదయం చింతకాని మండలం పాతర్లపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.
కాగా, గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి సాంకేతిక లోపమే కారణమని రైల్వే సిబ్బంది వెల్లడించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో విజయవాడ వెళ్లే మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు నిలిచిపోయాయి.