ఇల్లెందు, అక్టోబర్ 3: బయ్యారం స్టీల్ప్లాంటుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. బయ్యారంలో ఇనుప ఖనిజం నాణ్యతపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్లాంటు ఏర్పాటుపై జరిగిన పరిణామాలే రుజువు చేస్తున్నాయి. ఓబుళాపురం కంటే ఇక్కడే నాణ్యమైన ఖనిజం ఉన్నదని గతంలో మైనింగ్ శాఖ అధికారులే తేల్చారు. ప్లాంటు ఏర్పాటుకు సరిపడా స్థలం లేదన్న కిషన్రెడ్డి వాదన కూడా పచ్చి అబద్ధం. ప్లాంటు ఏర్పాటుకు 400 ఎకరాల భూమి సరిపోతుందని 2009లోనే అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపటం, దాని ఆధారంగా ప్లాంటు ఏర్పాటుకు రక్షణ స్టీల్స్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవటం మన కండ్లముందు ఉన్న వాస్తవం.
బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుపై ఎప్పుడు ఏం జరిగింది?
బయ్యారంలో ఇనుప ఖనిజం క్యాలిటీ, క్వాంటిటీ లేదు. అక్కడ ప్లాంట్ నిర్మాణానికి సరిపడా భూమిలేదు. బయ్యారంలో స్టీల్ప్లాంట్ అసాధ్యం.
– కేంద్రమంత్రి కిషన్రెడ్డి
బయ్యారంలో ఇనుప ఖనిజం కర్ణాటక, ఏపీలో విస్తరించి ఉన్న ఓబుళాపురం ఖనిజం కంటే నాణ్యమైనది. ఇక్క 60 ప్లస్ శాతం నాణ్యత ఉన్నది.
-మైనింగ్ శాఖ
01.03.1965 నుంచి 08.01.1974 వరకు వీ కేశవరావు బయ్యారం మండలంలోని రాంచంద్రాపురం వద్ద 329.95 హెక్టార్ల భూమిని లీజుకు తీసుకొన్నారు. పది సంవత్సరాలపాటు 90 లక్షల టన్నులు తరలించుకుపోయారు. దాని విలువ సుమారు రూ.18 వేల కోట్లు.
01.03.1957 నుంచి 15.01.1974 వరకు లాల్ అండ్ కంపెనీ బయ్యారం మండల పరిధిలోని మెట్ల తిమ్మాపురం గ్రామంలో 647.10 హెక్టార్ల భూమి లీజుకు తీసుకొన్నది. 17 సంవత్సరాలపాటు కోటి 70 లక్షల టన్నుల ఖనిజాన్ని తరలించుకుపోయింది. దీని విలువ సుమారు రూ.33 వేల కోట్లు.