హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): ఇంటర్.. డిగ్రీ.. పీజీ.. పీహెచ్డీ ఇది ఇంతకాలంగా నడుస్తున్న కోర్సుల వరుసక్రమం. కానీ ఇప్పుడు నాలుగేండ్ల డిగ్రీ తర్వాత పీజీ చదవకుండానే పీహెచ్డీలో చేరే అవకాశం త్వరలో అందుబాటులోకి రానున్నది. అయితే అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు నాలుగేండ్ల డిగ్రీలో 10 జీపీఏకు గాను 7.5 సీజీపీఏ సాధించాల్సి ఉంటుంది.
పీహెచ్డీ ప్రవేశాల కోసం మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అవార్డ్ ఆఫ్ పీహెచ్డీ డిగ్రీ రెగ్యులేషన్స్-2022 పేరుతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేయనున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్కుమార్ తెలిపారు. 2022 -23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ఉంటాయని చెప్పారు.