వరంగల్ : మేడారం భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నేటి (మంగళవారం) నుంచి హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.
హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి చార్జీలు పెద్దలు రూ. 125, పిల్లలకు రూ. 65చార్జీగా నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, 2022లో జరగనున్న మేడారం మహాజాతర తేదీనలు ఆలయ పూజరులు ప్రకటించారు.
2022 ఫిబ్రవరి 16 నుంచి 19 తేదీ వరకు ఈ జాతర నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.
జాతర తేదీలు ఇవే..
ఫిబ్రవరి 16 –సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెల వద్దకు తీసుకొస్తారు. ఫిబ్రవరి 17– చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. ఫిబ్రవరి 18 – సమ్మక్క-సారక్క అమ్మవార్లకు ప్రజలు మొక్కులు సమర్పించుకోవడం. ఫిబ్రవరి 19 – వన ప్రవేశం, మహా జాతర ముగింపు.