హైదరాబాద్ : మద్యం ప్రియులకు ( Liquor lovers ) తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ ( Good News ) చెప్పింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్ ( FIFA World Cup ) సందర్భంగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకుంది.
18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు, 19న జరిగే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వెసులుబాటు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.