నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 10: రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్తోపాటు మంత్రులు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించడం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్లో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో స్పీకర్ పోచారం పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో మంత్రి హరీశ్రావు, మహబూబ్నగర్ కలెక్టరేట్లో మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, వనపర్తి కలెక్టరేట్లో మంత్రి సింగిరెడ్డి , వరంగల్ జిల్లా రాయపర్తి మం డలంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఖమ్మం లో మంత్రి పువ్వాడ కేక్ కట్చేశారు. నిర్మల్లో ఎమెల్యేలు విఠల్రెడ్డి, రేఖా నాయక్తో కలిసి మంత్రి అల్లోల , జగిత్యాల కలెక్టరేట్లో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పాల్గొన్నారు.
మా యూపీలో ఇంత అభివృద్ధి లేదు
సీఆర్పీఎఫ్ అధికారి వినీత్కుమార్సింగ్
‘నేను తెలంగాణలో ఏడాది కాలంగా పని చేస్తున్నా. రోజురోజుకూ ఇక్కడి గ్రామాల్లో అభివృద్ధి కన్పిస్తున్నది. మా ఉత్తరప్రదేశ్లో ఇన్ని సంక్షేమ పథకాలు లేవు. అభివృద్ధి కూడా తక్కువే’నని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత్కుమార్ సింగ్ అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం ములుగు జిల్లా కన్నాయిగూడెంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు.