హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి చెందిన పలువురు నేతలు ఆ పార్టీని వీడనున్నట్టు సమాచారం. హైదరాబాద్ గోషామహల్కు చెందిన నేత విక్రమ్గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, సినీనటి జయసుధ, ఆకుల రాజేందర్ సహా పలువురు గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి రాజీనామా పత్రాలను సమర్పిస్తారని తెలిసింది. అనంతరం వీరు కాంగ్రెస్లో చేరుతారని సమాచారం. కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ తనయుడు, సిటీ బీజేపీ యువనేత విక్రమ్గౌడ్ అలకబూనారు. గోషామహల్ టికెట్ ఇస్తామని బీజేపీ పెద్దలు ఆయనకు ఆశపెట్టి.. చివరికి రాజాసింగ్కు టికెట్ ఇచ్చారు. దీనిపై విక్రమ్గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.