శంషాబాద్, సెప్టెంబర్ 13: శంషాబాద్ ఎయిర్పోర్టులో సోమవారం కస్టమ్స్ అధికారులు పది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు అందిన సమాచారంతో.. విమానంలో రియాద్ నుంచి వచ్చిన హైదరాబాద్కు చెందిన సురేందర్ను తనిఖీ చేశారు. లో దుస్తుల్లో అక్రమంగా తెచ్చిన బంగారం బిస్కట్ను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. స్మగ్లర్ను అదుపులోకి తీసుకొనికేసు దర్యాప్తు చేస్తున్నారు.