శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 8: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 1,182 గ్రాముల బంగారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడింది. బంగారాన్ని పేస్టుగా మార్చి, లోదుస్తుల్లో పెట్టుకొని తరలిస్తున్న ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.61.62 లక్షలు ఉంటుందని వివరించారు.