హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల వద్ద 412 గ్రాముల బంగారాన్ని పట్టుకోగా.. దాని విలువ రూ.20.49లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.