శంషాబాద్, డిసెంబర్ 10: సినీఫక్కీలో మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లర్స్ 7.3 కిలోల బంగారం స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. కస్టమ్స్ వివరాల ప్రకారం… దుబాయ్ నుంచి హైదరాబాద్కు శుక్రవారం విమానంలో నలుగురు సూడాన్ దేశస్థులు వచ్చారు. వారిలో ఇద్దరు మహిళలు. వీరిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. శరీరంలో కడ్డీలు, పేస్టు రూపంలో 7.3 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తునట్టు గుర్తించి బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 3.6 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు నలుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు