హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : తమిళనాడు రాష్ట్రం సేలంలోని శ్రీచైతన్య స్కూల్ విద్యార్థి యశ్వంత్ కరాటేలో బంగారు పతకం సాధించినట్టు ఆ స్కూల్ డైరెక్టర్ సీమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెలలో శ్రీలంకలో నిర్వహించిన సౌత్ ఏషియన్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో అండర్ 6 క్యాడెట్ జూనియర్ క్యాటగిరీలో యశ్వంత్ గెలుపొందాడని వెల్లడించారు. తమ స్కూల్ పిల్లలు చదువుల్లోనే కాకుండా క్రీడల్లో, ఇతర రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు.