కొనసాగుతున్న ఎత్తిపోతలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కాళేశ్వర జలాలు అన్నపూర్ణ జలాశయం దిశగా పరుగులు తీస్తున్నాయి. లింక్-1 లక్ష్మి పంప్హౌస్లోని 5 మోటర్లు, సరస్వతి పంప్హౌస్లో ఆరు పంపులు, పార్వతి పంప్హౌస్ 9 పంపుల ద్వారా ఎల్లంపల్లి జలాశయంలోకి 29,490 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. లింక్-2లోని పెద్దపల్లి జిల్లా నంది పంపుహౌస్లో ఆరు పంపుల ద్వారా కరీంనగర్ జిల్లాలోని గాయత్రి పంప్హౌస్కు, ఇక్కడి ఆరు పంపులతో నీటిని ఒకవైపు శ్రీరాజరాజేశ్వర జలాశయం, మరోవైపు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా జగిత్యాల జిల్లా రాంపూర్ పంప్హౌస్కు తరలిస్తున్నారు. ఈసారి గాయత్రి పంప్హౌస్ నుంచి 13.5 టీఎంసీలు ఎత్తిపోసినట్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. రాంపూర్ వద్ద 2 మోటర్ల ద్వారా 2,900 క్యూసెక్కుల నీటిని రాజేశ్వర్రావుపేట పంప్హౌస్కు పంపిస్తున్నారు. తిప్పాపూర్ పంప్హౌస్ నుంచి మొదటి పంపుతో అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 2,830 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.33 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.