హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. భారీ వర్షాల నేపథ్యంలో నదిలోకి వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ జలాశయం నుంచి భద్రాచలం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల వరకు 60.80 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి నదిలో ప్రస్తుతం 18.46లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
ఇదిలా ఉండగా.. భారీ నేపథ్యంలో భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని కలెక్టర్ అనుదీప్ కోరారు. భద్రాచలం వంతెన సాయంత్రం 5 గంటల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వరద ముంపు దృష్ట్యా వంతెనపై రెండ్రోజులపాటు రాకపోకలు ఆపేస్తున్నామని తెలిపారు. మరో వైపు భద్రాచలం పట్టణాన్ని వరద చుట్టుముడుతున్నది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి నీరు వరద నీరు వరద చేరింది.