ఖమ్మం: కుండపోతగా కురిసిన వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో జిల్లాలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్లాంట్ ఆవరణలోని కోల్స్టాక్ పాయింట్ వద్దకు గోదావరి వరద చేరింది. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా, గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 68.30 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. 22.76 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. మధ్యాహ్నం వరకు గోదావరి నీటిమట్టం 70 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.