హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు ప్రాజెక్టులను అప్పగించకపోవడంతో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు ప్రస్తుతం ఎలాంటి పనిలేకుండా పోయిందని కేంద్ర జల్శక్తి శాఖ అడిషనల్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ అభిప్రాయం వ్యక్తంచేశారు. జలసౌధలోని జీఆర్ఎంబీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. బోర్డు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, బోర్డు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బోర్డు పరిపాలన తీరుపై చర్చించారు.
ఈ సందర్భంగా సుబోధ్ యాదవ్ మాట్లాడుతూ.. బోర్డు అధికారులు ఇరు రాష్ర్టాలతో సఖ్యతగా వ్యవహరించాలని, బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధులను రాష్ర్టాల నుంచి మంజూరు చేయించుకోవాలని, పరిపాలన నిబంధనల మేరకు ముందుకు పోవాలని సూచించారు.