హైదరాబాద్, జూలై 13 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయం లో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా ముగిసింది. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో సా లకట్ల అణివార ఆస్థానాన్ని పురస్కరించుకొని ఉదయం తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అ ర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.