హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): నిజాం చకెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదికను సమర్పించాలని సీఎం రేవంత్రెడ్డి క్యాబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై ఆదివారం సచివాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాల గురించి సమగ్రంగా చర్చించారు. నిర్ణీత గడువు పెట్టుకొని నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. చకెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ చైర్మన్గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతోపాటు మంత్రులు దామోదర రాజనర్సిం హ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, రోహిత్రావు, లక్ష్మణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఏ చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.