TS EAMCET Results | ఇటీవల విడుదలైన ఇంటర్, టెన్త ఫలితాల్లో అమ్మాయిలు హవా సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవాళ విడుదలైన టీఎస్ ఎంసెట్ ఫలితాల్లోనూ అమ్మాయిలదే పైచేయి. ఇంజినీరింగ్ విభాగంలో అబ్బాయిలు 79 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో అబ్బాయిలు 84 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించారు.
మొత్తంగా ఇంజినీరింగ్ విభాగంలో 80.33 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86.34 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. 2022 ఫలితాలను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్ విభాగంలో 80.41 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 88.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది.