భూదాన్ పోచంపల్లి, జనవరి 12 : ప్రేమ పేరుతో బాలు డి వేధింపులు తాళలేక పదోతరగతి విద్యార్థిని ఉరేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామం లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న ది. పోలీసుల కథనం ప్రకారం.. జిబ్లక్పల్లికి చెందిన ఉప్పునూతల కనకయ్య కూతురు కావ్య (16) చౌటుప్పల్లోని ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన బాలుడు శివమణి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆ బాలికకు పరిచయమయ్యాడు. తరచూ ఫోన్లో మెసేజ్ చేస్తూ ప్రేమించాలని వేధించసాగాడు.
ఈ విషయాన్ని కావ్య తన సోదరుడు నరేశ్కు చెప్పడంతో అతడు గత డిసెంబర్ 31న శివమణిని కలిసి తన సోదరి జోలికి వస్తే బాగుండదని బెదిరించాడు. అయినప్పటికీ ఫోన్లు చేస్తుండటంతో ఈనెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. ఈ నెల 11న కావ్య కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగా శివమణి మళ్లీ ఫోన్ చేశాడు. తీవ్రమనస్తాపానికి గురైన ఆమె సూసైడ్ నోట్ రాసి సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకొన్నది. ఇరుగు పొరుగువారు గమనించి వచ్చిచూసే సరికి చనిపోయి ఉన్న ది. ఎస్సై సైదిరెడ్డి కేసు నమోదు చేశారు.