జహీరాబాద్ : అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ళ పొదల్లో పడేసిన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రుక్మాపూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్లపొదల్లో పడేశారు. శిశువు అరుపుల విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువుకు మెరుగైన వైద్యం అందించేందుకు తరలించారు. ఆడపిల్ల పుట్టినందుకే ఆ పాప తల్లిదండ్రులు ఇలా ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.